జార్ఖండ్ సీఎం ను విచారిస్తున్న ఈడీ అధికారులు

రాంచీలోని భూ కుంభకోణం కేసులో ఈడీ అధికారులు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను విచారిస్తున్నారు. కొద్దీ సేపటిక్రితం హేమంత్ సోరెన్ ఇంటికి వెళ్లిన ఈడీ అధికారులు ఓప్రత్యేక గదిలో విచారిస్తున్నారు. హేమంత్ సోరెన్ ఇంటికి ఈడీ అధికారులు చేరుకున్నారనే విషయం తెలిసి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు సీఎం నివాసానికి భారీగా తరలి వస్తున్నారు. దీంతో జేఎంఎం కార్యకర్తలు సీఎం నివాసం వెలుపల కంకే రోడ్డును దిగ్బంధించి ఈడీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మరోవైపు ముఖ్యమంత్రి నివాసం చుట్టూ భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ ప్రశ్నోత్తరాల కంటే ముందు జమ్‌తారా ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీ ముఖ్యమంత్రిని కలుసుకున్నారు.. ఆయనను కలిసిన తర్వాత భావోద్వేగానికి గురయ్యారు. సీఎంని కౌగిలించుకుని ఏడ్చారు. ఇక, సీఎం సోరెన్ ఇంటి దగ్గర జేఎంఎం పార్టీ కార్యకర్తలు ఈడీ చర్యకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు.