ఆ నిధులను ఎక్కడ ఖర్చు చేశారో చెప్పాలి

ప్రభుత్వంపై దేవినేని ఉమా విమర్శలు

devineni uma
devineni uma

అమరావతి: కరోనా నియంత్రణకు నెలకు రూ.500 కోట్లు ఖర్చు చేస్తున్నామంటోన్న ప్రభుత్వం ఆ నిధులను ఎక్కడ ఖర్చు చేస్తుందో చెప్పాలని టిడిపి నేత దేవినేని ఉమా మహేశ్వరరావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతిని అదుపుచేయలేకపోతున్నారంటూ ఆయన విమర్శలు గుప్పించారు.
‘కేసులు1,02,349, మరణాలు1100కు చేరాయి. కరోనా విజృంభిస్తున్న వేళ ప్రంట్ లైన్ వారియర్స్ పీపీఈ కిట్లులేక రైన్ కోట్లతో పనిచేస్తున్నారు. జీతాలురాక ఇబ్బందులు పడుతున్నారు. నెలకు పెడుతున్న 500 కోట్ల రూపాయలు, ఇప్పటివరకు పెట్టినఖర్చు ఎక్కడెక్కడ పెడుతున్నారో పారదర్శకంగా ప్రజలముందుపెట్టండి? వైఎస్ జగన్ గారు’ అని దేవినేని ఉమ నిలదీశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/