ఏపీకి పట్టిన మహమ్మారి చంద్రబాబు – పవన్
మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి చంద్రబాబు , పవన్ కళ్యాణ్ ఫై కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రానికి పట్టిన మహమ్మారి వీరిద్దరూ అని అన్నారు. చంద్రబాబు ఫ్యామిలీ అంతా కలిసి సెంటిమెంట్ ప్లే చేసేందుకు ప్రయత్నించారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత లోకేశ్ ఎక్కడున్నాడు? లాయర్లంతా బెజవాడ రోడ్లపై తిరుగుతుంటే లోకేశ్ ఎక్కడున్నాడు?. ఎవరిని మేనేజ్ చేద్దామని ఢిల్లీ వెళ్లారు?. మేనేజ్ చేయడం మీకు బాగా తెలిసిన విద్య’’ అంటూ పేర్ని నాని దుయ్యబట్టారు.
‘పవన్ ఐదు రోజులు కృష్ణా జిల్లా ఆటవిడుపు యాత్ర చేశారు. పవన్ మాటలు జనసేన పార్టీ కార్యకర్తలకు కూడా నచ్చడం లేదు. జగన్కు దమ్ముంది కాబట్టే ఏ పార్టీతో పొత్తు లేకుండా పోటీ చేస్తారు. జగన్.. పవన్లా రోజుకో పార్టీ మార్చరు. వైయస్ఆర్పై నువ్వు ఎప్పుడు పోరాటం చేశావు పవన్ ? అని నాని ప్రశ్నించారు. జగన్పై అవాకులు,చవాకులు మాట్లాడితే సహించం. బీజేపీ కంటే చంద్రబాబే తనకు ముఖ్యమని పవన్ తేల్చేశారు. కోలేరుపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని మాజి మంత్రి పేర్ని హితవు పలికారు.