ప్రతి బూతు మాటకు ప్రజలు ఓట్ల రూపంలో బుద్ధి చెపుతారుః దేవినేని ఉమా
లోకేశ్ కు నోటీసులు జారీ చేసిన పోలీసులు
అమరావతిః సీఎం జగన్, కొడాలి నాని, వల్లభనేని వంశీలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టిడిపి యువనేత నారా లోకేశ్ కు పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టిడిపి సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. జగన్ పై విమర్శలు గుప్పించారు. తల్లిని, చెల్లిని గెంటేసిన వ్యక్తికి, బాబాయ్ ని హత్య చేయించిన వాడికి పరువు ఉంటుందా? అని ప్రశ్నించారు. అవినీతి సొమ్మును కాపాడుకోవడానికి జగన్ బూట్లను కృష్ణా జిల్లా వైఎస్ఆర్సిపి నేతలు నాకుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సిపి నేతల ప్రతి బూతు మాటకు ఓట్ల రూపంలో ప్రజలు బుద్ధి చెపుతారని అన్నారు.