రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు కరోనా పాజిటివ్
హోం ఐసోలేషన్లో రాజ్నాథ్ సింగ్
న్యూఢిల్లీః దేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కరోనా బారినపడ్డారు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ వచ్చినట్టు తాజాగా తేలింది. ప్రస్తుతం మంత్రి హోం క్వారంటైన్లో ఉన్నారు. ఆయనకు ఓ మాదిరి రోగ లక్షణాలు ఉన్నట్టు తెలుస్తోంది. రాజ్నాథ్ సింగ్ను పరీక్షించిన వైద్యం బృందం విశ్రాంతి తీసుకోవాలని సూచించింది. మంత్రి కరోనా బారిన పడ్డ నేపథ్యంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్స్ కాన్ఫరెన్స్లో పాల్గొనరని కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది.