మైత్రి మూవీ మేకర్స్‌ ఆఫీస్ లలో కొనసాగుతున్న ఐటీ సోదాలు

Ongoing IT searches at Mythri Movie Makers offices

చిత్రపరిశ్రమకు మరోసారి ఐటీ సోదాలు ఖంగారు పెట్టిస్తున్నాయి. నిన్నటి నుండి ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ లలో , నిర్మాతల ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. బుధవారం రోజంతా తనిఖీలు నిర్వహించిన ఐటీ అధికారులు… ఈరోజు ఉదయం నుంచి జూబ్లిహిల్స్‌లోని మైత్రి ఆఫీసుతోపాటు నిర్మాతల ప్రమోటర్స్‌ కార్యాలయాల్లోనూ సోదాలు చేస్తున్నారు.

ఆర్‌బీఐ అనుమతి లేకుండా రూ.500కోట్ల వరకు అమెరికా నుంచి పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ గుర్తించిన నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. వ్యాపార లావాదేవీలకు సంబంధించిన వివరాలను రాబడుతున్నట్లు సమాచారం. గత డిసెంబర్‌లో మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ లలో దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఐటీకి అందించిన లెక్కలు, కాగితాల్లో వ్యత్యాలు ఉన్నట్లుగా గుర్తించారు. తనిఖీల తర్వాత జనవరిలో మైత్రి మూవీస్ విడుదల చేసిన వీర సింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమా బడ్జెట్, లాభాలు, చెల్లించిన ఇన్‌ కంటాక్స్‌ లెక్కల్లోనూ భారీగా వ్యత్యాసం ఉందని సమాచారం. ఐటీ అధికారుల తనిఖీలు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం. మైత్రి మూవీస్‌ నిర్మాణంలో ప్రస్తుతం పుష్ప-2 , తో పాటు పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు తెరకెక్కుతున్నాయి.