కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ గా దీపాదాస్ మున్షీ
ఇప్పటివరకు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ గా మాణిక్రావ్ ఠాక్రే వ్యవహరించగా..ఇప్పుడు ఆయన స్థానంలో దీపాదాస్ మున్షీ ను నియమించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం వెనుక మాణిక్రావ్ ఠాక్రే పనితీరు ఏంటో ఉంది..ఇక ఇప్పుడు త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధిష్టానం పలు మార్పులు చేసింది. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో పార్టీ జనరల్ సెక్రటరీలు, ఇన్చార్జులను మార్చింది.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్గా, జనరల్ సెక్రటరీగా దీపాదాస్ మున్షీని నియమించింది. కేరళ, లక్షద్వీప్తో పాటు అదనంగా ఆమెకు తెలంగాణ బాధ్యతలను అప్పగిస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రానికి పార్టీ చీఫ్ అబ్జర్వర్గా పనిచేసిన మున్షీ.. పార్టీ నేతలను కో ఆర్డినేట్ చేయడంలో సక్సెస్ అయ్యారనే పేరు పార్టీలో ఉన్నది. ఈ క్రమంలోనే దీపాదాస్ మున్షీకి రాష్ట్ర బాధ్యతలను అప్పగించినట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రానికి ఇన్చార్జ్గా ఉన్న మాణిక్ రావ్ ఠాక్రేకు గోవా, దాద్రానగర్ హవేలి, డయ్యూ డామన్కు ఇన్చార్జ్గా బాధ్యతలు అప్పగించారు. అలాగే గతంలో ఏఐసీసీ మీడియా కో ఆర్డినేటర్గా తెలంగాణలో పనిచేసిన సీడబ్ల్యూసీ మెంబర్ అజయ్ కుమార్ను ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి ఇన్చార్జ్గా నియమించారు.