తెలంగాణ లో ఫస్ట్ అడుగుపెట్టబోతున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ మొదటిసారి తెలంగాణ లో అడుగుపెట్టబోతున్నారు. రీసెంట్ గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముశీతాకాల విడిది పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ నెల 27 న రాష్ట్రానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ రాబోతున్నారు.
ఈ నేపథ్యంలో అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయా లని సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. ఈ మేరకు ఆమె శనివారం సెక్రటేరియెట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉపరాష్ట్రపతి రాష్ట్రానికి రావడం తొలిసారి కావడంతో పోలీస్ బందోబస్తు, పోలీస్ బ్యాండ్ను ఏర్పాటు చేయాలని సూచించారు. బ్లూ బుక్ ప్రకారం తగిన భద్రత కల్పించడంతో పాటు ట్రాఫిక్, బందోబస్తుకు సంబంధించిన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని తెలిపారు. ఉపరాష్ట్రపతి పర్యటనకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలన్నారు.