రాజకీయాల్లో ఇక నవ్వులు పూయిస్తా అంటున్న మంత్రి రోజా

ఆంధ్రప్రదేశ్​ కేబినెట్​ పునర్​వ్యవస్థీకరణలో భాగంగా నగరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్​కే రోజా.. పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో ఆమె టీవీ, సినిమా షూటింగ్​లలో ఇక పాల్గొననని ప్రకటించారు. ఈ ప్రకటన తో అభిమానులు షాక్ అవుతున్నారు. రాజకీయాలు కొనసాగిస్తూనే..బుల్లితెర ఫై సందడి చేయాలని కోరుతున్నారు. కానీ రోజా మాత్రం జబర్దస్త్‌ లో అయిపోయింది..ఇక రాజకీయాల్లో నవ్వులు పూయిస్తానని తెలిపింది.

కడప, ఇడుపులపాయల లో పర్యటించిన ఆమె మాట్లాడుతూ… వైఎస్సార్ నాకు దేవుడు.. ఆయన ఆశయాల సాధన కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ అని కొనియాడారు. అందుకే ఆయన ఆశిస్సుల కోసమే ఇడుపులపాయ సందర్శన అని… ఆయనకు నివాలర్పించాలనే కడపకు రావడం జరిగిందని అన్నారు. తెలుగుదేశం పార్టీ లో ఉన్నప్పుడు వైఎస్ నన్ను పార్టీలోకి రమ్మని ఆహ్వానించారని.. ఎమ్మెల్యే కావాలనేది నాకల అని… కల నెరవేరింది.. మంత్రిని కూడా అయ్యానన్నారు. జగనన్న మంత్రి వర్గంలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను..గతంలో ఓంటిమిట్ట రధోత్సవానికి వచ్చినప్పుడు జగన్ ను సీఎం చేయాలని వేడుకున్నానని .. తన కోరిక నెరవేర్చినందుకు మరోమారు కళ్యాణోత్సవానికి హజరవుతున్నానని రోజా తెలిపింది.