తార్నాకలో నార్కోటిక్ అధికారుల సోదాలు.. 11 మంది అరెస్టు
తార్నాకలోని ఓయూ పోలీసులతో కలిసి నార్కోటిక్ బృందం సోదాలు
హైదరాబాద్: హైదరాబాద్ బంజారాహిల్స్లోని రాడిసన్ బ్లూ హోటల్ లోని పుడింగ్ అండ్ మింక్ పబ్పై దాడి చేసిన అధికారులకు డ్రగ్స్ కూడా లభ్యమైన విషయం విదితమే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు మత్తు పదార్థాల విక్రయాలపై సీరియస్గా ఉన్నారు. హైదరాబాద్లో మత్తు పదార్థాల వినియోగాన్ని కట్టడి చేయడానికి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
ఈ క్రమంలో తార్నాకలోని ఓయూ పోలీసులతో కలిసి నార్కోటిక్ బృందం తార్నాకలో సోదాలు నిర్వహించి, మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న 11 మందిని అరెస్టు చేసింది. నిందితుల నుంచి నార్కోటిక్ బృందం గంజాయితో పాటు హాష్ ఆయిల్ను స్వాధీనం చేసుకుంది.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/