కాంగ్రెస్ పార్టీలో చేరిన డీఎస్

సీనియర్ నేత డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఠాక్రే ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డీఎస్‌తో పాటు ఆయన కుమారుడు సంజయ్ కూడా కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలని డీఎస్‌ను వీహెచ్ కోరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం రాహుల్ గాంధీపై అనర్హత వేటును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ చేపడుతున్న సత్యాగ్రహ దీక్షలో డీఎస్ పొల్గొన్నారు. ఈ సత్యాగ్రహ దీక్షలో జానారెడ్డి, వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు.

ఇక డీఎస్ మాట్లాడుతూ. .రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసే వారికి అసలు అర్హత ఉందా..? అంటూ ప్రశ్నించారు. తాను పీసీసీగా ఉన్నప్పటి సమయానికి.. ఇప్పటికీ రాహుల్‌తో చాలా తేడా ఉందని తెలిపారు. రాహుల్ గాంధీ ఊహించిన దానికంటే గొప్పగా పనిచేస్తున్నారంటూ డీఎస్ కితాబిచ్చారు. రాహుల్ గాంధీకి మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు స్పష్టం చేశారు.