రెండు నెలల్లో పిల్లలపై కొవాగ్జిన్‌ ట్రయల్స్‌ పూర్తి

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడి

covaxin trials on children
covaxin trials on children

New Delhi: రెండు నెలల్లో పిల్లలపై కొవాగ్జిన్‌ ట్రయల్స్‌ పూర్తవుతాయని ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. భారత్‌ బయోటెక్‌ కంపెనీ కొవాగ్జిన్‌ టీకాను ప్రస్తుతం 2-17 ఏళ్ల మధ్య పిల్లలపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్నారు. జైడస్‌ కంపెనీ 12-18 సంవత్సరాల పిల్లలపై క్లినికల్ ట్రయల్స్‌ నిర్వహిస్తోంది. 5-12 సంవత్సరాల మధ్య వయస్సు పిల్లలపై వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ ప్రారంభించేందుకు యోచిస్తున్నది. మరో వైపు అహ్మదాబాద్‌కు చెందిన ఔషధ సంస్థ జైడస్‌ క్యాడిలా టీకా రెండో స్వదేశీ వ్యాక్సిన్‌ కాగా.. తొలి డీఎన్‌ఏ వ్యాక్సిన్ మిగిలిన వ్యాక్సిన్లకు ఇది విభిన్నమని తెలుస్తోంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/