నిమ్స్లో ‘కొవాగ్జిన్’ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం
నిమ్స్లో కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం
హైదరాబాద్: హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. ఇద్దరు వాలంటీర్లకు కొవాగ్జిన్ అనే వ్యాక్సిన్ను నిమ్స్ వైద్యులు ఇచ్చారు. స్వదేశీ కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ను భారత్ బయోటెక్ రూపొందించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) సహకారంతో హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ ‘కొవాగ్జిన్’ పేరిట టీకాను అభివృద్ధి చేస్తున్నది. ఈ వ్యాక్సిన్పై మొదటి, రెండో క్లినికల్ ట్రయల్స్ జరిపేందుకు ఇండియన్ డ్రగ్ రెగ్యులేటరీ అనుమతులను మంజూరు చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 375 మంది వలంటీర్లపై మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినట్టు సంస్థ శుక్రవారం ప్రకటించింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/