నరేష్ – పవిత్ర లోకేష్ వ్యవహారంలో కోర్ట్ కీలక ఆదేశం

నరేష్ – పవిత్ర లోకేష్ వ్యవహారంలో నాంపల్లి కోర్ట్ కీలక ఆదేశాలు జారీచేసింది. గత కొద్దీ రోజులుగా సీనియర్ హీరో నరేష్ – పవిత్రాల ఫై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పెళ్లిళ్లు అయిన వీళ్లు సహజీవనం చేయడంపై కొన్ని వెబ్‌సైట్లు, యూట్యూబ్‌ ఛానల్స్‌ ట్రోలింగ్‌ చేస్తూ వస్తున్నారు.

ఈ క్రమంలో నరేష్ – పవిత్రలు కోర్ట్ ను ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం సైబర్ క్రైమ్ పోలీసులు ఆదేశాలు ఇచ్చింది. నరేశ్ పేర్కొన్న 12 మందిపై విచారణ చేపట్టాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో సైబర్ క్రైమ్ పోలీసులు 12 మందికి నోటీసులు జారీ చేశారు. ఈ అంశంపై ఏసీపీ కేవీఎం ప్రసాద్ స్పందిస్తూ.. మరోసారి విచారణ జరుపుతామని తెలిపారు. తమకు అందిన ఫిర్యాదుతో గతంలో విచారణ జరిపామని .. 11 యూట్యూబ్ చానళ్ల వివరాలు ఇవ్వాలని యూట్యూబ్ యాజమాన్యానికి లేఖ రాశామని పేర్కొన్నారు. యూట్యూబ్ నుంచి ఇంకా సమాచారం రాలేదని అన్నారు.