మెట్రో ట్రైన్ ను ఏకంగా బెడ్ రూమ్ గా మార్చుకున్న ప్రేమ జంట

కొంతమంది ప్రేమ మత్తులో పబ్లిక్ ప్లేస్ లలో రెచ్చిపోతున్నారు. బహిరంగ ప్రదేశాలలో ముద్దుల్లో తేలాడుతూ..సమాజాన్ని మరచిపోతున్నారు. ముఖ్యంగా మెట్రో ట్రైన్ లలో ప్రేమ జంటలు ఈ మధ్య రెచ్చిపోతున్నారు. పబ్లిక్ గా ముద్దులు పెట్టుకోవడం ..అంతకు మించి ముందుకు వెళ్లడం చేస్తున్నారు. దీంతో అధికారులు ఆలా చేసే వారిపై కఠిన చర్యలు చేపడుతున్నారు. అయినప్పటికీ వారి తీరు మాత్రం మారడం లేదు.

తాజాగా ఢిల్లీ మెట్రో ఫ్లోర్‌పై ఓ జంట ఒకరినొకరు ముద్దుపెట్టుకున్న ఈ వీడియో ప్రస్తుతం హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఒక అబ్బాయి నేలపై కూర్చుని, తన ప్రియురాలిని తన ఒడిలో పడుకోబెట్టుకోవడం చూడవచ్చు. ఏ మాత్రం తడబడకుండా ఇద్దరూ లిప్ లాక్ చేసుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వీడియో వైరల్ కావడంతో పలువురు ట్విట్టర్‌లో ఈ జంటపై విమర్శలు గుప్పిస్తున్నారు.