భారత్లో ఒక్కరోజులో 9,983 కొత్త కేసులు
మొత్తం కరోనా కేసలు 2,56,611

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కేసులు భారత్లో రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 9,983 మందికి కొత్తగా కరోనా సోకింది. దేశంలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 206 మంది మరణించారు. ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 2,56,611కి చేరగా, మృతుల సంఖ్య 7,135కి చేరుకుంది. 1,25,381 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,24,095 మంది కోలుకున్నారు. ఈమేరకు తాజాగా కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలను విడుదల చేసింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/