దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

India – corona virus

న్యూఢిల్లీః దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 1,89,087 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 6,660 కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4.49 కోట్లకు చేరింది. ప్రస్తుతం దేశంలో 63,380 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మహమ్మారి నుంచి ఇప్పటి వరకు 4,43,11,078 మంది కోలుకున్నారు. గత 24 గంటల వ్యవధిలో 24 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం కొవిడ్‌ మరణాల సంఖ్య 5,31,369కి ఎగబాకింది. ఇక ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 0.14 శాతం మేర యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. రికవరీ రేటు 98.67 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 220.66 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.