ఉత్తర కొరియాలో సరికొత్త అంటువ్యాధి

పేగు సంబంధిత వ్యాధి అయి ఉండొచ్చని భావిస్తున్న అధికారులు

ప్యాంగాంగ్‌: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తున్న వేళ ఉత్తరకొరియా చాలా ప్రశాంతంగా ఉంది. అయితే, ప్రపంచంలో కరోనా కేసులు తగ్గుతున్న వేళ ఆ దేశంలో మహమ్మారి పంజా విసిరింది. ప్రస్తుతం ఉత్తరకొరియాలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే జ్వరం లక్షణాలతో బాధ పడుతున్న కేసులు 26,010 వచ్చాయి. దీంతో ఈ కేసుల మొత్తం సంఖ్య 40,56,000కి చేరింది.

మరోవైపు ఆ దేశంలో కొత్తగా మరో అంటువ్యాధి ఆందోళనను కలిగిస్తోంది. ఓడరేవు నగరమైన హేజులో అంతుచిక్కని అంటువ్యాధితో ప్రజలు బాధపడుతున్నారు. ఇది పేగు సంబంధిత వ్యాధి అయి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ వ్యాధి బారిన ఎంత మంది పడ్డారనే విషయాన్ని మాత్రం అధికారులు వెల్లడించలేదు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/