తెలంగాణలో మళ్ళీ విజృంభిస్తున్న కరోనా
కొత్తగా 364 కేసులు
Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొత్తగా 364 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ను విడుదల చేసింది. .రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3.02 లక్షలకు చేరింది. శుక్రవారం కరోనా వైరస్తో ఇద్దరు మృతి చెందారు. మొత్తం 1,666 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 2,607 యాక్టివ్ కేసులు ఉండగా..మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కరోనా నుంచి 2.98 లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా వైరస్ మళ్లీ పెరుగుతుండటంతో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/