అమేథీలో కాంగ్రెస్ ఆఫీస్ ఫై దాడి

లోక్ సభ ఎన్నికల సమయంలో అమేథీలోని కాంగ్రెస్ కార్యాలయంపై ఆదివారం అర్ధరాత్రి దుండగులు దాడి చేసారు. కార్యాలయం బయట పార్క్ చేసిన పదుల సంఖ్యలోని వాహనాలను ధ్వంసం చేసి ఆ ప్రాంతంలో గందరగోళం సృష్టించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.

ఈ దాడి బీజేపీ పనేనని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. పగిలిన కార్ల అద్దాలు, గాజు ముక్కలతో చెల్లాచెదురుగా పడివున్న పరిసరాల వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. అమేథీలో ఓటమి తప్పదన్న భయంతోనే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించింది. కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా ష్రినాట్ మాట్లాడుతూ ఇది బీజేపీ దుష్టచర్యే (హూలిగానిజం)నని ఆగ్రహం వ్యక్తం చేసారు. కాగా, అమేథీ, రాయ్‌బరేలీలో నేడు ప్రియాంకగాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ దాడి జరగడం గమనార్హం.