జార్ఖండ్ మాజీ మంత్రి ఇంటిపై ఈడీ అధికారుల దాడి..బయటపడ్డ నోట్ల కట్టలు
![](https://www.vaartha.com/wp-content/uploads/2024/05/Virendra-Ram.jpg)
జార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున నగదు పట్టుపడింది. జార్ఖండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ మాజీ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర రామ్, అతడికి సంబంధించిన వ్యక్తుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించగా రూ.25 కోట్ల నగదు పట్టుపడింది.
ఈ నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అధికారులు స్వాధీనం చేసుకున్నారు.` మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎమ్ఎల్ఏ) కింద ఫిబ్రవరి 2023లో అరెస్ట్ అయిన వీరేంద్ర రామ్కు సంబంధించిన ఆరు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. కాగా నగదుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒక గదిలోని కరెన్సీ నగదు కట్టలు వీడియోలో కనిపిస్తున్నాయి. రాంచీలోని సెయిల్ సిటీతో సహా తొమ్మిది ప్రాంతాల్లో సోదాలు నిర్వహించామని ఈడీ వెల్లడించారు.