‘కరోనా’నివారణా చర్యలపై సిఎం జగన్ సమీక్ష

కరోనా పరీక్షలు నిర్వహించే సంఖ్యను క్రమంగా పెంచాలి

AP CM YS Jagan
AP CM YS Jagan

అమరావతి: ఏపి సిఎం జగన్‌ ఈరోజు రాష్ట్రంలో కరోనా నివారణా చర్యలపై సమీక్షనిర్వహించారు. నిన్న ఒక్కరోజే 6,520 ఆర్టీపీసీఆర్ టెస్టులు చేశామని, ఇప్పటివరకు మొత్తం 48,034 పరీక్షలు చేశామని జగన్ కు అధికారులు తెలిపారు. కొరియా నుంచి తెప్పించిన కిట్లకు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చిందని, నిర్దేశించిన ప్రొటోకాల్ ప్రకారం ర్యాపిడ్ టెస్టు కిట్లతో పరీక్షలు జరుగుతాయని అధికారులు తెలిపారు. ర్యాపిడ్ టెస్టు కిట్లతో ఇప్పటి వరకూ 14,423 పరీక్షలు చేశామని చెప్పారు. కరోనా పరీక్షల సంఖ్య బాగా పెరిగిందని అధికారులను జగన్ అభినందించారు. ‘కరోనా’ పరీక్షలు నిర్వహించే విషయంలో వెనకడుగు వేయొద్దని, పరీక్షలు నిర్వహించే సంఖ్యను క్రమంగా పెంచాలని సూచించారు. అత్యవసర కేసులకు, డెలివరీ కేసులకు ఇబ్బంది రాకుండా చూడాలని 104 కు కాల్ చేస్తే వెంటనే స్పందించేలా ఉండాలని అన్నారు. ఏపీలో ప్రతిపాదిత వైద్య కళాశాలలకు వెంటనే స్థలాలు గుర్తించాలని ఆదేశించారు. ఏ సమస్య ఉన్నా ప్రజలు 1902కు కాల్ చేయాలని సూచించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక చేయండి:https://www.vaartha.com/telangana/