గులాబీ కండువా కప్పుకున్న తెల్లం వెంకట్రావ్

Congress Leader tellam venkata rao Joins In BRS

హైదరాబాద్‌ః కాంగ్రెస్ కీలక నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అనుచరుడు తెల్లం వెంకట్రావ్ కాంగ్రెస్ ను వీడి బిఆర్ఎస్ లో చేరారు. మంత్రులు కెటిఆర్, పువ్వాడ అజయ్ కుమార్, భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సమక్షంలో హైదరాబాద్ లో తన అనుచరలతో కలిసి ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ని నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్టేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ స్వభావం తెలుసుకునేందుకు తెల్లం వెంకట్రావుకు నెలకంటే ఎక్కువ సమయం పట్టలేదన్నారు. కెసిఆర్‌ హయాంలో జల్ …జంగల్ …జమీన్ లో ఏలాంటి అభివృద్ధి జరుగుతుందో ప్రజలు ఆలోచించాలి. తెలంగాణ లో వానాకాలం లో కోటి ఎకరాల సాగు జరుగుతోంది. కెసిఆర్‌ హయాంలో తెలంగాణ కోటి ఎకరాల మాగణ అయ్యింది అన్నారు.

ఛత్తీస్ గడ్ లో పొడు భూములకు పట్టాలు ఇచ్చారా ? అక్కడ కాంగ్రెస్ సర్కార్ ఉంది…కానీ ఆ పార్టీ నేతలు ఇక్కడ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. కాంగ్రెస్ వాళ్లకు కూడా రైతు బంధు 24 గంటల కరెంట్ వస్తది. కానీ బయటకు వచ్చి కాంగ్రెస్ నేతలు కెసిఆర్ ను నోటికొచ్చినట్టు తిడతారు. యాదాద్రి తరహాలో భద్రాద్రి నిర్మాణం చేపడుతామన్నారు. ఇక వామపక్షాలు ,నక్సలైట్ లు కోరుకున్నట్లు తెలంగాణ లో అభివృద్ధి జరుగుతుందని కెటిఆర్‌ తెలిపారు.