రైతు భరోసా, మత్స్యకార భరోసాలపై సిఎం సమీక్ష
కోల్డ్ స్టోరేజీల ఏర్పాటుపై దృష్టిసారించాలని ఆదేశం
అమరావతి: ఏపిలో రైతుభరోసా, మత్స్యకార భరోసాపై సిఎం నేడు సమీక్ష నిర్వహించారు. లభ్దిదారుల జాబితాను రెండు వారాల పాటు గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఆక్వా ఉత్త్పత్తుల నిల్వకు అవసరమయిన కోల్డ్ స్టోరేజిల ఏర్పాటుపై దృష్టిపెట్టాలని, అలాగే గుజరాత్ లో చిక్కుకున్న తెలుగు మత్స్యకారుల బాగోగులపై దృష్టి సారించాలని అన్నారు. అలాగే రాష్ట్రంలో కరోనా నివారణకు సంబంధించి అధికారులకు పలు విషయాలను సిఎం దిశానిర్ధేశం చేశారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/