టిఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్బవించి 20 సంవత్సరాలు

ఏప్రిల్‌ 27 తో 20 సంవత్సరాలు పూర్తిచేసుకుంటున్న టిఆర్‌ఎస్‌ పార్టీ

santhosh kumar
santhosh kumar

హైదరాబాద్‌: అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్‌ పార్టి ఆవిర్బవించి ఏప్రిల్‌ 27 తో 20 సంవత్సరాలు అవుతుంది. పార్టీ ఆవిర్బావ కార్యక్రమాన్ని ఉత్సవ వాతావరణంలో జరుపుకోవాల్సి ఉండగా… ప్రస్తుతం కరోనా కారణంగా ఈ కార్యక్రమాన్ని సాదాసీదాగా జరపాలని అధిష్టానం నిర్ణయించింది. ఈ సారి టిఆర్‌ఎస్‌ పార్టి ఆవిర్బావ దినోత్సవ రోజన పార్టీ గుర్తులో తయారు చేసిన మాస్క్‌లను ధరించాలని టిఆర్‌ఎస్‌ యువనేత, రాజ్య సభ సభ్యుడు సంతోష్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. అంతేకాదు సామాజిక దూరం పాటిస్తు అందరికి యుద్ద ప్రాతిపదికన మాస్కుల పంపిణి జరగాలని సూచించారు. 20 ఏళ్లుగా పార్టీకోసం శ్రమిస్తున్న టిఆర్‌ఎస్‌ సహచరులందరికి పార్టీ ఆవిర్బావ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ట్వీట్‌చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/