సిఎం కెసిఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష

TS CM KCR
TS CM KCR

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ ఈరోజు ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ, అనుబంధశాఖ మంత్రులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. రాష్ట్రంలో పంట ఉత్పత్తులు, వరి ధాన్యం కొనుగోళ్లు, నిధుల సమీకరణ, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, వసతుల కూర్పు, ఆన్‌లైన్ చెల్లింపులపై సిఎం కెసిఆర్‌ సుదీర్ఘ సమీక్ష నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత వానాకాల సీజన్‌లో ఉత్పత్తి కానున్న వరి ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. వర్షాకాలం పంట ఉత్పత్తులు చేతికి వస్తుండటంతో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను వారం.. పది రోజుల్లో ప్రారంభించనున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/