ప్రధాని మోడితో సిఎం జగన్‌ సమావేశం

cm jagan – pm modi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడితో సిఎం జగన్‌ ఈరోజు ఉదయం సమావేశమయ్యారు. రాష్ట్రానికి కేంద్రం అందించాల్సిన సహాయం, చెల్లించాల్సిన బకాయిలు, రాష్ట్ర విభజన హామీలు, తదితర  17 అంశాలపై ప్రధానికి సిఎం నివేదించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. కాగా ప్రధాని మోడితో భేటీ అనంతరం కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అధ్యక్షతన ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో సిఎం జగన్‌ పాల్గొననున్నారు. ఏపి పునర్‌ వ్యవస్థీకరణ చట్టాన్ని అనుసరించి జల వివాదాల పరిష్కారానికి వీలుగా కేంద్ర జల శక్తి శాఖ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/