రేపు విజయవాడలో పర్యటించనున్న సిఎం జగన్
అమరావతిః సీఎం జగన్ విజయవాడ రేపు విజయవాడ పర్యటనకు బయలు దేరనున్నారు. ఈ సందర్భంగా విద్యా ధరపురం స్టేడియం గ్రౌండ్లో వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ఐదో విడత నిధుల విడుదల కార్యక్రమంలో సిఎం జగన్ పాల్గొంటారు.
రేపు ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సిఎం జగన్ బయలుదేరనున్నారు. విద్యాధరపురం స్టేడియం గ్రౌండ్లో వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ఐదో విడత నిధుల విడుదల కార్యక్రమం జరుగనుంది. ఇక ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగం కూడా ఉంటుంది. అనంతరం తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు. కాగా, ఈరోజు మిలాద్ ఉన్ నబీ పండుగ ఉన్న తరుణంలో హాలీ డే జగన్ సర్కార్ ప్రకటించింది.