30న నంద్యాల, కడప జిల్లాల పర్యటన వెళ్లనున్న సిఎం జగన్

cm jagan

అమరావతిః సిఎం జగన్‌ ఈ నెల 30న నంద్యాల, కడప జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లాలో అవుకు రెండవ టన్నెల్‌ను జాతికి అంకితం చేయనున్నారు. కడప పెద్దదర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాలలో పాల్గొననున్నారు. ఈ మేరకు ఈ నెల 30న ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు.

ఈ తరుణంలోనే… సిఎం జగన్‌ నంద్యాల జిల్లా అవుకు మండలం మెట్టుపల్లికు వెళతారు. అక్కడి నుంచి అవుకు రెండవ టన్నెల్‌ సైట్‌కు చేరుకోనున్నారు. నీటిని విడుదల చేసి రెండవ టన్నెల్‌ను జాతికి అంకితం చేయనున్నారు. ఫొటో ఎగ్జిబిషన్‌ పరిశీలన, పైలాన్‌ ఆవిష్కరణ చేస్తారు. అక్కడి నుంచి నేరుగా కడప పెద్దదర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాలలో పాల్గొననున్నారు. ఇక సాయంత్రం తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు.