బొలీవియా అధ్యక్షురాలుకి కరోనా పాజిటివ్
ఆరోగ్యం బాగానే ఉందన్న అధ్యక్షురాలు

బొలీవియా: కరోనా మహమ్మారి దేశాధ్యక్షులపై తన పంజా విసురుతుంది. ఇటివల బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సనారో కరోనా బారినపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా బొలీవియా తాత్కాలిక అధ్యక్షురాలు జీనిన్ అనెజ్కు కరోనా సోకింది. తనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించారు. అయితే, తన ఆరోగ్యం కుదురుగానే ఉందని, ఐసోలేషన్లో ఉండి పనిచేస్తానని తెలిపారు. ఆమె మంత్రివర్గంలోని నలుగురు ఇటీవలే ఈ వైరస్ బారినపడడంతో అనుమానంతో జీనిన్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కాగా, వెనిజులా రాజ్యాంగ అసెంబ్లీ అధ్యక్షుడు డియోస్డాడో కాబెల్లో కూడా కరోనా బారినపడినట్టు తెలుస్తోంది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా కరోనా కోరల్లో చిక్కుకుని బయటపడిన సంగతి తెలిసిందే.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/