వైట్‌హౌస్‌లో ప్రధానికి బైడెన్ దంపతుల సాదర స్వాగతం

ద్వైపాక్షిక అంశాలపై బైడెన్, మోడీ చర్చలు

indian-prime-minister-modi-meets-joe-biden-jill-biden

వాషింగ్టన్‌: ప్రస్తుతం అగ్రరాజ్య పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ, అధ్యక్షుడు జో బైడెన్‌తో సమావేశమయ్యారు. వైట్‌ హౌస్‌లో ప్రధానికి బైడెన్ దంపతులు సాదర స్వాగతం పలికారు. ఆ తరువాత ఇరు నేతలూ పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఈ భేటీ అనంతరం బైడెన్ మోడీకి పురాతన అమెరికన్ బుక్ గ్యాలీతో పాటూ పాతకాలపు అమెరికన్ కెమెరాను కూడా ఇవ్వనున్నారు. కాగా, ప్రధానికి బైడెన్ దంపతులు అధికారిక విందు కూడా ఇవ్వనున్నారు.

ఇక శుక్రవారం ప్రధాని మోడీ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, ఆమె భర్త ఏర్పాటు చేసే విందుకు హాజరవుతారు. నేడు అమెరికా ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్న మోడీ ఆ తరువాత నోబెల్ విజేత, ఆర్థికవేత్త పాల్ రోమన్‌తో భేటీ అవుతారు.