నేడు ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లనున్న సీఎం జగన్
![](https://www.vaartha.com/wp-content/uploads/2023/06/cm-jagan-jpg.webp)
అమరావతిః ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం తొలిసారి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈరోజు (గురువారం) బయటకు రానున్నారు. విజయవాడ బెంజి సర్కిల్లో ఉన్న -ఐ-ప్యాక్ సంస్థ ఆఫీస్ను ఆయన సందర్శించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి వ్యూహకర్తగా వ్యవహరించిన ఐ-ప్యాక్ సంస్థ ప్రతినిధులతో ఆయన ముచ్చటించనున్నారు.
ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో వైసీపీ కోసం కృషి చేసిన బృందానికి ఆయన కృతజ్ఞతలు చెప్పనున్నారు. బృంద సభ్యులకు కొన్ని బహుమతులను కూడా అందజేయనున్నారని సమాచారం. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఐ-ప్యాక్ కార్యాలయానికి చేరుకొని దాదాపు 30 నిమిషాలపాటు వారితో జగన్ మాట్లాడనున్నారు.
ముఖ్యమంత్రి ఉదయం 11.53 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరి విజయవాడ బెంజ్ సర్కిల్లో ఉన్న ఐప్యాక్ ఆఫీసుకు 12 గంటలకు చేరుకుంటారు. అక్కడ 20 నిమిషాల పాటూ గడిపి.. 12.23కు అక్కడి నుంచి బయల్దేరి మధ్యాహ్నం 12.30 గంటలకు తాడేపల్లిలోని ఇంటికి చేరుకుంటారు. సీఎం జగన్ ఈ నెల 17న లండర్ పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే.. జూన్ 1న తిరిగి రాష్ట్రానికి వస్తారు.