మంత్రులకు వార్నింగ్ ఇచ్చిన సీఎం జగన్

సీఎం జగన్..మంత్రులకు వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలను గెలిపించే బాధ్యత మంత్రులకు అప్పగించారు. ఒక్కో మంత్రికి ఆరుగురు ఎమ్మెల్యేల బాధ్యతలను అప్పగించారు. బాధ్యతలు సరిగా నిర్వహించకపోతే మంత్రి పదవి నుంచి తప్పిస్తానని సీఎం హెచ్చరించారు. మంగళవారం సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్‌ భేటీ జరిగింది. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లోని మంత్రివర్గ సమావేశ మందిరంలో ఈ సమావేశం కొనసాగింది.

ఈ సమావేశంలో సీఎం జగన్, మంత్రులతో కీలక అంశాలను ప్రస్తావించారు. జులై నుంచి విశాఖ నుంచే పాలన కొనసాగిస్తామని తెలిపారు. 7 స్థానాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు గెలవాలన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలను గెలిపించే బాధ్యత మంత్రులకు అప్పగించారు. ఒక్కో మంత్రికి ఆరుగురు ఎమ్మెల్యేల బాధ్యతలను అప్పగించారు. బాధ్యతలు సరిగా నిర్వహించకపోతే మంత్రి పదవి నుంచి తప్పిస్తానని సీఎం హెచ్చరించారు. అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు సిద్దంగా ఉండాలని మంత్రులను ఆదేశించారు. గత నాలుగేళ్లలో ప్రజలకు ఏం చేశామో.. అసెంబ్లీ వేదికగా అంశాలవారీగా మాట్లాడాలని మంత్రులకు తెలిపారు.