జగనన్న తోడు నిధులు విడుదల చేసిన సిఎం జగన్‌

CM Jagan to Release Jagananna Thodu Funds

అమరావతిః జగనన్న తోడు నిధులు విడుదల అయ్యాయి. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొని…ఒక్కొక్కరికి 10 వేల రూపాయల రుణం సిఎం జగన్‌ అందించారు. దీంతో 3,95,000 చిరు వ్యాపారులకు లబ్ది చేకూరింది. ఈ సందర్బంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ….దేవుని దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతోంది. లక్షల మంది చిరువ్యాపారులకు మంచి జరిగించే మంచి కార్యక్రమం అని కొనియాడారు. ఈ రోజు జగనన్న తోడు అనే కార్యక్రమం 8వ విడత జరుగుతోందని చెప్పారు. పరిస్థితి ఎలా ఉంటుంది, వీళ్ల బతుకులు ఎలా ఉంటాయనేది మన కళ్ల ఎదుటే కనిపిస్తున్నా వాళ్ల బతుకులు ఎలా మార్చాలి, వీళ్లకు డబ్బులు పుట్టాలి, వ్యాపారాలు చేసుకోవాలంటే వీళ్లు పడుతున్న కష్టాలేమిటి అని బహుశా ఎప్పుడూ ఎవరూ ఇంత ఆలోచన చేయలేదని వెల్లడించారు. నా కళ్ల ఎదుట కనిపించినప్పుడు, దాదాపు నా పాదయాత్రవల్ల జరిగిన పరిస్థితులుగానీ, ప్రతి జిల్లాలోనూ ఇది కనిపించేదని పేర్కొన్నారు.