దేశంలో కొత్తగా 6,984 కరోనా కేసులు

న్యూఢిల్లీ : దేశంలో కొత్తగా 6,984 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే ఈ మహమ్మారి కారణంగా మరో 247 మంది మృత్యువాత పడ్డారు. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో మొత్తం 8,168 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 87,562 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో ఇప్పటి వరకూ మొత్తం 134.61 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగిందని వారు తెలిపారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/