విశాఖకు బయలుదేరిన సిఎం జగన్
విశాఖ వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరిన చంద్రబాబు
అమరావతి: సిఎం జగన్ విశాఖపట్నంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో గ్యాస్ లీకైన ఘటనపై పరిస్థితులను దగ్గరుండి తెలుసుకునేందుకు తాడేపల్లి నుంచి విశాఖ బయలుదేరారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను జగన్ పరామర్శించనున్నారు. అలాగే, ఆసుపత్రుల్లో చేరి, చికిత్స తీసుకుంటున్న వారిని పరామర్శిస్తారు. కాగా గ్యాస్ లీక్ దుర్ఘటనలో మృతుల సంఖ్య ఏడుకి చేరినట్లు తెలిసింది.
మరోవైపు టిడిపి అధినేతఅధినేత చంద్రబాబు నాయుడు కాసేపట్లో విశాఖపట్నం బయలుదేరే అవకాశం ఉంది. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు విశాఖలోని టిడిపి నేతలు ముందుకు రావాలని ఇప్పటికే ఆయన కోరారు. విశాఖ వెళ్లేందుకు ఆయన కొద్ది సేపటి క్రితం కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరారు. బాధితులను పరామర్శించి, అలాగే, సహాయక చర్యల్లో పాల్గొంటామని కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు తెలిపారు. కేంద్రం అనుమతి ఇస్తే వెంటనే ఆయన విశాఖ బయలుదేరుతారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/