బహుముఖ ప్రజ్ఞాశాలి గిడుగు రామ్మూర్తిః సిఎం జగన్
రాష్ట్ర ప్రజలకు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సిఎం జగన్
అమరావతిః సిఎం జగన్ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వాడుక భాషోద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తించుకున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమని అన్నారు. తెలుగు సాహిత్యాన్ని, తెలుగు భాష తీయదనాన్ని సామాన్యుడికి చేర్చిన ఘనత ఆయకే సొంతమని కొనియాడారు. ఈ మేరకు సిఎం జగన్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.
తెలుగు భాష వికాసానికి గిడుగు రామ్మూర్తి అందించిన సేవలు మర్చిపోలేనివి. తెలుగు భాషలో గ్రాంథిక వాదాన్ని తొలగించి, వ్యవహారిక వాదానికి శ్రీకారం చుట్టిన మహా మేధావి ఆయన. 1863 ఆగస్టు 29న ఆయన జన్మించారు. చరిత్ర విభాగంలో అధ్యాపకుడిగా పని చేశారు. సంప్రదాయక విద్య కంటే ఆధునిక విద్యలో విశాల దృష్టి అవరమని చెప్పారు. ప్రపంచీకరణ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు పరభాషా వ్యామోహంలో పడిపోతున్నారు. తెలుగులో రాయడం, చదవడం, మాట్లాడడాన్ని మర్చిపోతున్నారు. దీంతో సొంత గడ్డపైనే తెలుగు పరాయి భాషగా మిగిలిపోయింది. తెలుగు భాష యాసలో పలు రకాలున్నాయి. వీటిలో తెలంగాణ యాస ప్రత్యేకమైనది. ఆ భాషకున్న శక్తితోనే కవులు, రచయితల సాహిత్యం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరి పోసింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/