జగన్ కీలక నిర్ణయం : 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జిల మార్పు
ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గరపడుతుండడం తో వైస్సార్సీపీ అధినేత పార్టీలో మార్పులు చేర్పులు చేస్తున్నారు. కీలక వ్యక్తులకు పలు పదవులు అప్పగించి..పార్టీ ని విజయాపదంలో నింపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా 11 నియోజకవర్గాలకు సంబంధించి పార్టీ ఇంచార్జ్ లను మార్చారు.
ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
నియోజకవర్గం – ఇన్చార్జి పేరు
- ప్రత్తిపాడు- బాలసాని కిరణ్ కుమార్
- కొండేపి- ఆదిమూలపు సురేశ్
- వేమూరు- వరికూటి అశోక్ బాబు
- తాడికొండ- మేకతోటి సుచరిత
- సంతనూతలపాడు- మేరుగు నాగార్జున
- చిలకలూరిపేట- మల్లెల రాజేశ్ నాయుడు
- గుంటూరు (వెస్ట్)- విడదల రజని
- అద్దంకి- పాణెం హనిమిరెడ్డి
- మంగళగిరి- గంజి చిరంజీవి
- రేపల్లె- ఈవూరు గణేశ్
- గాజువాక- వరికూటి రామచంద్రరావు