కేసీఆర్ ను పరామర్శించిన చంద్రబాబు , చిరంజీవి

బిఆర్ఎస్ అధినేత , తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ప్రమాదానికి గురై..సోమాజిగూడ యశోద హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ ప్రమాదానికి గురయ్యారనే వార్త యావత్ రాష్ట్ర ప్రజల్నే కాదు రాజకీయ , సినీ ప్రముఖులను సైతం ఆందోళనకు గురి చేసింది. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం కుదుటపడుతుండడం తో అంత ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

అలాగే ప్రతి రోజు పెద్ద ఎత్తున ప్రముఖులు హాస్పటల్ కు వచ్చి కేసీఆర్ ఆరోగ్య వివరాలు అడిగి , ఆయన్ను చూసి వెళ్తున్నారు. ఈరోజు సోమవారం మాజీ సీఎం చంద్రబాబు తో పాటు మెగా స్టార్ చిరంజీవి , నటుడు ప్రకాష్ రాజ్ తదితరులు వచ్చి వెళ్లారు. చంద్రబాబు , చిరంజీవి లు స్వయంగా కేసీఆర్ దగ్గరికి వెళ్లి ..ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు.