19న మెదక్ జిల్లాలో పర్యటించనున్న సిఎం కెసిఆర్
హైదరాబాద్ః సిఎం కెసిఆర్ మెదక్ జిల్లా పర్యటన ఖరారైన విషయం తెలిసిందే. ఆగస్టు 19న సిఎం కెసిఆర్ మెదక్ జిల్లాలో కలెక్టర్ కార్యాలయం, జిల్లా పోలీసు (ఎస్పీ) కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సమావేశానికి ముందు జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించానున్నారు. అయితే సీఎం పర్యటన ఏర్పాట్లపై సోమవారం మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాలు వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. సిఎం కెసిఆర్ పర్యటన నేపథ్యంలో మెదక్ జిల్లా నుండి భారీగా జన సమీకరణ చేస్తున్నామన్నారు.