ఛత్తీస్గఢ్, మిజోరం లలో కొనసాగుతున్న పోలింగ్
ఛత్తీస్గఢ్, మిజోరం రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు.. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఛత్తీస్గఢ్లోని 20 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. వీటిలో సమస్యాత్మక అంతగఢ్, భానుప్రతాపుర్, కంకేర్, కేష్కల్, కొండగావ్, నారాయణపుర్, దంతెవాడ, బీజాపూర్, కొంటా స్థానాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగనుంది. మరోవైపు మిగతా నియోజకవర్గాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు ఓటింగ్ జరుగుతుంది.
ఇక మిజోరం లో మొత్తం 40 స్థానాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. 174 మంది అభ్యర్థుల ఈ ఎన్నికల్లో తమ లక్ పరీక్షించుకుంటుండగా.. 8 లక్షలకు పైగా ఓటర్లు ఓటింగ్లో పాల్గొంటున్నారు. రాష్ట్రంలో పోలింగ్కు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు చేపట్టింది.
ఓటింగ్ కోసం 1276 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. 24 థోరంగ్ (ఎస్టీ) నియోజకవర్గం పరిధిలో థెలెప్ పోలింగ్ స్టేషన్లో అత్యల్పంగా 26 మంది ఓటర్లే ఉన్నారు. ఐజ్వాల్ ఈష్ట్ (జెనరల్) నియోకవర్గంలోని 24 జెమంబ్వాంక్ పోలింగ్ స్టేషన్ పరిధిలో అత్యధికంగా 1481 మంది ఓటర్లు ఉన్నారు. ఇక రాష్ట్రంలోని 30 పోలింగ్ కేంద్రాలను సున్నితమైన ప్రాంతాలుగా ప్రకటించారు.