ఛత్తీస్గఢ్లో మరోసారి తుపాకుల మోత..ఏడుగురు నక్సల్స్ హతం
న్యూఢిల్లీః ఛత్తీస్గఢ్లో మరోసారి తుపాకుల మోత మోగింది. మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. నారాయణ్పూర్ జిల్లా అబుజ్ మడ్ అటవీ ప్రాంతంలో పోలీసులు, నక్సల్స్ మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు నక్సల్స్ మృతిచెందారు. ఘటనాస్థలి నుంచి పోలీసులు భారీ మొత్తంలో తుపాకులు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ కాల్పులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా, సోమవారం రాత్రి నుంచే గాలింపు చేపట్టిన ఈ బృందాలు.. మంగళవారం ఉదయం నక్సల్స్ ఉన్న ప్రాంతానికి చేరుకోగా వీరిని చూసిన నక్సల్స్ కాల్పులు జరిపారు. దీంతో ఎదురు కాల్పులు జరిపిన భద్రతా దళాలు నలుగుర్ని మట్టుబెట్టాయి. మరికొందరు పరారైనట్లు అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో భద్రతా సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని బస్తర్ ఐజీ సుందర్రాజ్ వెల్లడించారు. ఘటనాస్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోందని పేర్కొన్నారు.