రేపు ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్న చంద్రబాబు

రా కదలిరా సభలు నిర్వహిస్తున్న టిడిపి

handrababu-naidu

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబునాయుడు రేపు (జనవరి 7) ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. చంద్రబాబు ఆ రెండు జిల్లాల్లో ‘రా కదలిరా’ సభలకు హాజరుకానున్నారు. తిరువూరులో అయ్యప్పస్వామి ఆలయం వద్ద, ఆచంటలో ఆచంట-మార్టేరు రోడ్ వద్ద ఈ సభలు జరగనున్నాయి.

చంద్రబాబు పర్యటన షెడ్యూల్… (07-01-2024)

ఉదయం 9.30: హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచి ఎయిర్ పోర్టుకు పయనం
ఉదయం 10.00: బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్ లో పయనం
ఉదయం 11.15: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు చేరిక
ఉదయం 11.30: తిరువూరులో అయ్యప్పస్వామి ఆలయం వద్ద బహిరంగ సభకు హాజరు

మధ్యాహ్నం 2.30: తిరువూరు సభ ముగింపు
మధ్యాహ్నం 2.45: తిరువూరు నుంచి హెలికాప్టర్ లో పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట పయనం
మధ్యాహ్నం 3.30: ఆచంట చేరిక
సాయంత్రం 4.00: ఆచంట-మార్టేరు రోడ్ వద్ద బహిరంగ సభకు హాజరు
సాయంత్రం 6.00: ఆచంట సభ ముగింపు

సాయంత్రం 6.30: ఆచంట-మార్టేరు రోడ్ నుంచి రాజమండ్రి ఎయిర్ పోర్టుకు పయనం
రాత్రి 8.30: రాజమండ్రి ఎయిర్ పోర్టు నుంచి పయనం