ద్వారకాదీశుడి ఆలయంలో జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రత్యేక పూజలు
ద్వారక: ఈరోజు ఉదయం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ గుజరాత్ రాష్ట్రం ద్వారకలోని ద్వారకాదీశ్ ఆలయంలో ద్వారకాదీశుడిని దర్శించకున్నారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి వెంట ఆయన సతీమణి, భద్రతా సిబ్బంది ఉన్నారు. ఉదయాన్నే శ్రీ ద్వారకాదీశ్ ఆలయానికి చేరుకున్న సీజేఐ దంపతులకు ఆలయ అర్చకులతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సీజేఐ దంపతులు సంప్రదాయ పట్టు వస్త్రదారణలో ద్వారకాదీశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.