పెద్దిరెడ్డికి చంద్రబాబు మాస్ వార్నింగ్..

టీడీపీ అధినేత చంద్రబాబు..మంత్రి పెద్దిరెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. అన్ని లెక్కలు రాస్తున్న.. వచ్చే సంక్రాంతికి ఎక్కడ ఉంటావో చూసుకో అని అన్నారు. స్వగ్రామం నారావారిపల్లె లో కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి సంబరాలలో నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా, తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు చంద్రబాబు. భోగి మంటల్లో పనికిరాని వస్తువులను వేస్తామని, అందుకే తాను జీవో నెంబర్ వన్ కాపీలను భోగిమంటల్లో వేస్తున్నట్లు వివరించారు.

మళ్ళీ రాష్ట్రానికి మంచిరోజులు వస్తున్నాయ్…పుంగనూరులో పది రోజుల్లో వందమంది పై కేసులు పెట్టారని మండిపడ్డారు. ఈ పండగగా పూట మావాళ్ళు జైల్లో ఉన్నారు….మంత్రి పెద్దిరెడ్డిని హెచ్చరిస్తున్నా..వచ్చే పండగకు ఎక్కడ ఉంటావో చూసుకో..అన్ని లెక్కలు రాస్తున్న…. ఈసారి క్షమించే ప్రసక్తి లేదు అని హెచ్చరించారు.