రోడ్డుపై చంద్రబాబు నిరసన

తిరిగి విమానాశ్రయంవైపు తరలించేందుకు పోలీసుల ప్రయత్నలు

chandrababu
chandrababu

విశాఖ: టిడిపి అధినేత చంద్రబాబు విశాఖ పర్యటన సందర్భంగా టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తల తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. చంద్రబాబు పర్యటను అడ్డుకోవడానికి వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలు ఆయన కాన్వాయ్‌ ముందు పడుకుని గందరగోళం సృష్టించారు. ఈ నేపథ్యంలో టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. కాగా ఇప్పటికే రెండుగంటలకు పైగా వాహనంలో కూర్చోన్న చంద్రబాబు కొద్దిసేపటి క్రితం దిగి రోడ్డుపై కూర్చుని నిరసన తెలియజేశారు. చంద్రబాబుతో పాటు అచ్చెన్నాయుడు, పంచుమర్తి అనురాధ, చినరాజప్ప తదితరులతో కలిసి రోడ్డు పై బైఠాయించారు. మరొవైపు చంద్రబాబను విశాఖనుంచి వెనక్కు పంపడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు వాహనాన్ని వెనక్కు తిప్పి పెట్టారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/