ఇలాంటి ఘటనలను రాజకీయం చేయొద్దు
దేశ రాజధానిలో శాంతి స్థాపనకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి
న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో చేలరేగిన హింసకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ డిమాండ్ చేయడాన్ని కేంద్రమంత్రి ప్రకాశ్ జవడేకర్ తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో పరిస్థితిని ఎప్పటికప్పుడు హోంమంత్రి అమిత్ షా సమీక్షిస్తున్నారని జవడేకర్ తెలిపారు. అలాంటి వ్యక్తిని రాజీనామా కోరడం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసే ఇలాంటి వ్యాఖ్యలు పోలీసుల్లో ఎలాంటి ధైర్యాన్నీ నింపలేవన్నారు. ఇలాంటి ఘటనలనురాజకీయం చేయొద్దని హితవు పలికారు. అమాయక సిక్కుల రక్తంతో తడిసిన చేతులు వాళ్లవని, అలాంటి వారు ఇవాళ హింస గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. దేశ రాజధానిలో శాంతి స్థాపనకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని జవడేకర్ కోరారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/