పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు భేటీ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో టీడీపీ అధినేత చంద్రబాబు తో భేటీ అయ్యారు. ప్రస్తుతం ఈ భేటీ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ గా మారింది. అంతకు ముందు జనసేన పార్టీ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైస్సార్సీపీ నేతల ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈరోజు నుంచి రాష్ట్ర ముఖచిత్రం మారబోతుందని చెప్పిన ఆయన.. జనసేన లాంటి పార్టీ బిజెపిని రోడ్డు మ్యాప్ అడగడం ఎదుకని విమర్శలు వచ్చాయని.. ఎందుకో బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో కలిసి వెళ్లలేకపోతున్నామనిి అన్నారు.

బిజెపి నాయకత్వం అంటే గౌరవమే కానీ.. అలాగని ఊడిగం చేయలేము అని అన్నారు. పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుండగానే..విజయవాడ లోని నోవెటల్ హోటల్ కు టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లారు. పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. మరి ఈ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు..దీనిపై ఏం మాట్లాడతారా అనేది అంత ఎదురుచూస్తున్నారు.