నేడు ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కుమారుడి పెళ్లి రిసెప్షన్‌ నేడు ఢిల్లీ లో జరగనుంది. ఈ వేడుకకు చంద్రబాబు తో పాటు సతీమణి భువనేశ్వరి కూడా వెళ్లనున్నారు. హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి వెళ్లి.. రాత్రి జరిగే రిసెప్షన్‌కు హాజరవుతారు. తర్వాతి రోజు సాయంత్రం ఢిల్లీ నుంచి బయల్దేరి హైదరాబాద్‌కు చేరుకుంటారు.

ఇక స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు తరుపు సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే. బాబు కు బెయిల్ రావడంలో సిద్దార్థ్ కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఈ కేసులో బాబు రెగ్యులర్ బెయిల్ మీద బయట ఉన్నారు. చంద్రబాబుకు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడం ఫై రాష్ట్ర ప్రభుత్వం గత వారం సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీనిపై మంగళవారం (నవంబరు 28) సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ జరగనుంది.