బాసర ట్రిపుల్‌ ఐటీలో మరో విద్యార్థి బలవన్మరణం..

బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఇప్పటికే పలువురు విద్యార్థులు ఒత్తిళ్లలకు గురై ఆత్మహత్యలు చేసుకోగా..తాజాగా మరో విద్యార్థి ఆత్మ హత్య చేసుకున్నాడు. నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గం లో గల ఆర్జీయూకేటీ బాసరలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి రామాటి ప్రవీణ్ కుమార్ వ్యక్తిగత కారణాలతో బలవన్మరణం చెందాడు.

ప్రవీణ్ కుమార్ ఆత్మహత్య పట్ల వీసీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బైంసా ఆసుపత్రికి తరలించారు. ప్రవీణ్ కుమార్‌ స్వస్ధలం నాగర్ కర్నూల్. కాగా, బాసర ట్రిపుల్ ఐటీలో ఇదివరకే పలువురు విద్యార్ధిని, విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా, తాజాగా ప్రవీణ్ కుమార్ అనే ఇంజినీరింగ్ ఫస్టియర్ స్టూడెంట్ బలవన్మరణం చెందాడు.